Jagan-BJP: బీజేపీకి చేరువైతున్న జగన్..! చంద్రబాబుతో కటీఫేనా..!
Jagan-BJP: బీజేపీకి చేరువైతున్న జగన్..! చంద్రబాబుతో కటీఫేనా..!

నిన్న ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నిరసన తెలపడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నిరసనపై ట్వీట్ చేస్తూ ''
నిన్న జరిగిన AI సమ్మిట్లో, యువజన కాంగ్రెస్ మనందరినీ సిగ్గుపడేలా చేసింది. మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి! ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన రాజకీయ విభేదాలు ఏవైనా, మనం ఎల్లప్పుడూ ప్రపంచానికి ఐక్య ముఖాన్ని ప్రదర్శించాలి'' అని ప్రకటించారు.
అయితే చంద్రబాబు కంటే ముందే ఈ విషయంపై జగన్ స్పందించడంతో బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్రమక్రమంగా జగన్ బీజేపీకి దగ్గరవుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ మధ్య కాలంలో లడ్డూ విషయంలో కూడా అనవసర చర్చ చేయకూడదని బీజేపీ నుంచి చంద్రబాబు అండ్ బ్యాచ్కు సంకేతాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబుతో బీజేపీ కటీఫ్ చెప్పనుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మొదటి నుంచీ జగన్పై బీజేపీతో టచ్ మీ నాట్ అన్నట్లే వ్యవహరిస్తుంటుంది. జగన్ కూడా బీజేపీ పట్ల సాఫ్ట్కార్నరే ప్రదర్శిస్తుంటారు. జగన్పై టీడీపీ నేతలు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ నుంచి పెద్దగా స్పందన ఉండదు. నేరుగా బీజేపీపై జగన్, జగన్పై బీజేపీ విమర్శించుకున్న దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా జగన్ స్పందన చూసి వీరి మధ్య బలం మరింత బలపడనుందనేది రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.


