BJP MLA Adi Narayana Reddy: ఆంధ్రప్రదేశ్లో 'కమ్మ'టి పాలన .. ఆది నారాయణరెడ్డి ఆవేదన !
BJP MLA Adi Narayana Reddy: ఆంధ్రప్రదేశ్లో 'కమ్మ'టి పాలన .. ఆది నారాయణరెడ్డి ఆవేదన !

మాజీ మంత్రి జమలమడుగు ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి తిరుపతిలో కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు, ఆయన మాట్లాడారు, మాట్లాడుతున్న సందర్భంగా, కూటమి ప్రభుత్వం పైన ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చను రేకెత్తిస్తున్నాయి. ఏమన్నారు ఆదినారాయణ రెడ్డి, ఆదినారాయణరెడ్డి రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది అన్నారు. రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది అన్నారు, గతంలో గజ్జల మల్లారెడ్డి, ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎలా ఉంది అంటే రాష్ట్రంలో, ఎన్టీ రామారావు నేతృత్వంలో కమ్మటి పాలన నడుస్తోంది అని చెప్పారు. ఆరోజు మల్లారెడ్డి గారు చెప్పిన మాటనే ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది అని అన్నారు, ఆయన మాటల వెనక అసంతృప్తి కనబడుతోంది. ఆయన మాటల వెనక ఆవేదన కనబడుతుంది. ఆయన మాటల వెనక రాష్ట్రంలో ఓ కులం మాత్రమే అధికారంలో ఉంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది, అనే మాట వినపడుతుంది. ఈ రాష్ట్రంలో కేవలం ఒక కులం పాలన చేస్తోంది, కులం మొత్తం ఆధిపత్యం చేస్తోంది, ఇలాంటి మాట అటువంటి ఒక ఆలోచన అటువంటి ఒక అంచన కూటమిలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యే కి రావడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలోనూ 14 -19 వరకు అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ పైన ఈ తరహ విమర్శలు, ఈ తరహా మాటలు చాలా విన్నాం. ఈ తరహ విశ్లేషణలు చాలా చూసాం. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ, 19లో ఓడిపోవడానికి కూడా అది కొంత కారణం అయింది. ఇప్పుడు మళ్ళీ అదే మాట ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచో, ఇంకెవరి వైపు నుంచో కాకుండా, భారతీయ జనతా పార్టీ, కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేత నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన నర్మ గర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఎక్కడా దాచుకోలేదు, ఆయన హిడెన్ గా కూడా మాట్లాడలేదు, కమ్మటి పాలన నడుస్తోంది రాష్ట్రంలో, ఒక కులం మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు, అన్ని కులాలను గౌరవించాల్సిన అవసరం ఉంది, అన్ని కులాలకు ప్రాతినిధ్యం రావాల్సిన అవసరం ఉంది, అనే మాట కూడా మాట్లాడారు. కమ్మటి పాలనా అని నేను అన్నాను దాన్ని మీరు తప్పుగా ఎందుకు తీసుకున్నారు అని ఆయన రేపు పొద్దున మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా, ఓపెన్ గానే మాట్లాడారు. ఒక కులానికి కాదు, అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనే మాట చెప్పడం ద్వారా రాష్ట్రంలో ఒక కులానికి సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. పాలనలో అనే విషయాన్ని కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి మేము కారణం, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు లాంటి అసంతృప్తి కూడా ఆయన మాటల్లో ధ్వనించింది. రాష్ట్రంలో కూటమి ఏర్పాటు అవ్వడానికి రీజన్ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ లేకపోతే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడేదే కాదు, భారతీయ జనతా పార్టీ లేకపోతే, ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చేది కాదు ఆదినారాయణ రెడ్డి మాటలు ఇవి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరువాతే, ఎందుకంటే మేము వచ్చినా, మేము రావడం వల్లే కూటం ఏర్పడింది, మేము రావడం వల్లే అధికారంలోకి రాగలిగాం, మమ్మల్ని తక్కువ చేస్తే ఎట్లా, మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా, మాకు ప్రాధాన్యత లేకపోతే ఎట్లా, ఆయన మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఉండట్లేదు, భారతీయ జనతా పార్టీని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే ఆవేదన కనిపించింది. దానితో పాటు ఓ కులానికి పెద్ద పీట వేస్తున్నారు, మిగతా కులాలని పట్టించుకోవట్లేదు అనే ఆవేదన కూడా కనిపించింది. తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో, జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వివాదం చూశాం. సిమెంట్ లారీలకు సంబంధించిన అంశానికి సంబంధించి వివాదం నేరుగా కొట్టుకునేదా, కార్యకర్తలు మోహరింపు, ఎస్పీల లేఖలు రాయడం, పేకాట వ్యవహారం ఇవన్నీ కూడా వివాదాలు చూశాం. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


