విజయవాడలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

విజయవాడలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు మరణించడంతో నెల్లూరు జిల్లాకు చెందిన 19 సంవత్సరాల యువతి మానసిక వేదనతో బాధపడుతున్న ఆ యువతి, ఒంటరిగా నెల్లూరు నుంచి బస్సులో ప్రయాణించి విజయవాడ బస్టాండ్‌కు వచ్చింది.దారి మధ్యలో ఆమె ఫోన్, పర్సు పోగొట్టుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఆకలితో, ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎవరూ లేని బాధతో ఆమె సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్లి సహాయం కోరింది. "నాకు ఎవరు లేరు… కొంచెం టిఫిన్ పెట్టండి… పని చేసుకుంటూ నేనే హాస్టల్‌లో ఉంటాను…దయచేసి నన్ను అక్కడికి చేర్చండి" అని ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంది.

యువతి పరిస్థితి చూసి ఆటో డ్రైవర్లు ముందుగా ఆమెకు టిఫిన్ ఏర్పాటు చేశారు. తరువాత విషయాన్ని అర్థం చేసుకున్న వారు తెలివిగా ఆలోచించి ఆ యువతిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.అక్కడ పోలీసులు ఆమె మాటలు విన్న వెంటనే విషయం సీఐకి పోలీస్ సిబ్బంది తెలియజేశారు. సీఐ తక్షణమే స్పందించి వాసవ్య మహిళా మండలికి ఫోన్ చేసి, ఆ యువతి పూర్తిగా సురక్షితంగా ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆమె బంధువులు వచ్చే వరకు ఆమెను వాసవ్య సంరక్షణలో ఉంచి, అన్ని విధాలుగా సహాయం అందించాలని పోలీసుల సూచన మేరకు చర్యలు వేగంగా తీసుకున్నారు. కాలుష్యంతో నిండిన ఈ కాలంలో ఇలాంటి మానవత్వం చూపిన ఆటో డ్రైవర్లపై, అలాగే వెంటనే స్పందించి రక్షణ కల్పించిన కృష్ణలంక పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story