ఈరోజు ap BRS అధ్యక్షులు తోట చంద్ర శేఖర్(Thota Chandra Shekhar) సమక్షంలో పలు జిల్లాలకు చెందిన నేతలు BRS తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ వైకాపా(Vaikapaka) అధికారం చేపట్టిన నాటి నుండి ఏపీ అభివృద్ది ఆమడదూరంలో ఉందని దుయ్యబట్టారు.

ఈరోజు ap BRS అధ్యక్షులు తోట చంద్ర శేఖర్(Thota Chandra Shekhar) సమక్షంలో పలు జిల్లాలకు చెందిన నేతలు BRS తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ వైకాపా(Vaikapaka) అధికారం చేపట్టిన నాటి నుండి ఏపీ అభివృద్ది ఆమడదూరంలో ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ రాజధాని(capital) ఏదో చెప్పుకోలేని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రజానీకముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు బిఆర్ఎస్(BRS) నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.ఏపీ లో బి ఆర్ ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిందని చెప్పారు. ఈరోజు భారాస లో చేరిన వారిలో పుంగనూరు కి చెందిన రమ్య యాదవ్.పవన్... విజయవాడ కి చెందిన కంది ప్రశాంత్. శరత్. కె, మోహన్ బాబు.. గోదావరి ఖని కి చెందిన .

రఘు వీరా ప్రసాద్( బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు) .చీరాల కి చెందిన స్వప్న గౌడ్ అనంతపురం జిల్లా కి చెందిన సుధాకర్...సహ పలు జిల్లాకి చెందిన నాయకులు, కార్యకర్తలు BRS తీర్ధం పుచ్చుకున్నారు. వారిని ఆంధ్ర ప్రదేశ్ brs పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.తెలంగాణ మోడల్ అభివృద్దిని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని స్పస్టం చేశారు.రానున్న కాలంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందని ఆ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయె ఎన్నికల్లో BRS ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated On 13 May 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story