MLA Kolusu Parthasarathy : మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోం
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైసీపీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..

MLA Kolusu Parthasarathy Made Sensational Comments on YCP High Command
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి(MLA Kolusu Parthasarathy) వైసీపీ(YCP) అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని అన్నారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడమే నా అసమర్థతా.? అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా.? అని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.
వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందమేనని అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పెనమలూరు(Penamaluru) నుంచి తనను కాదని.. వైసీపీ గెలిచే పరిస్ధితి లేని గన్నవరం(Gannavaram) సీటుకు వెళ్లమన్నారని వెల్లడించారు. తాను బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా ఫర్వాలేదని అనుకున్నట్లున్నారన్నారని.. కానీ తాను ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. బలహీన వర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పాను.. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. బీసీ(BC)లు, ఎస్సీ(SC)లు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారని.. వారు మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే నాలా ఆత్మాభిమానం చంపుకోరని సంచలన కామెంట్స్ చేశారు.
