Nara Bhuvaneswari: హెరిటేజ్ వివరణ, సంపూర్ణమా?
Nara Bhuvaneswari: హెరిటేజ్ వివరణ, సంపూర్ణమా?

శ్రీవారు అనాథ కానీ హెరిటేజ్ కాదు, శ్రీవారి లడ్డు అంశానికి సంబంధించి ఎవరి నోటికి వచ్చిందో, వాళ్ళు మాట్లాడుతున్న శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తినాలంటే భయపడే పరిస్థితి, ఆందోళన చెందే పరిస్థితి, అనుమానించే పరిస్థితి, కోట్లాది మంది హిందువులకు కల్పించిన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రధానంగా అధికార కూటమి లడ్డులో. నోటితో చెప్పడానికి పదే పదే ఇబ్బందిగా ఉంది, అటువంటి జంతువుల కొవ్వు కలిపారు, అని పదే పదే ప్రకటనలు చేస్తూ, తిరుమల శ్రీవారి లడ్డు ప్రాశస్యాన్ని తగ్గించే ప్రయత్నం, తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్లి లడ్డు తినాలంటే జనం ఇబ్బంది పడే పరిస్థితిని కల్పించడం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీవారి లడ్డు పైన ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అని అడిగే వాళ్లే లేకుండా పోయారు. శ్రీవారు అనాథ అయిపోయారు. శ్రీవారి లడ్డు కూడా అనాదిగా మారిపోయింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా, ఎవరికీ తోచిన విధంగా, వాళ్ళు శ్రీవారి లడ్డు పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది తప్పుడు ప్రచారం, అటువంటిది ఏది కలవలేదని సిట్ చెప్పిన తర్వాత కూడా, మరింత వికృతంగా మారిపోయి, శ్రీవారి లడ్డు పైన జుగుప్స కలిగించే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంట్లో అది కలిపా,రు ఇది కలిపారు అంటూ సో శ్రీవారికి సంబంధించిన లడ్డు పైన ఇప్పటికీ పొలిటికల్ అజెండాగా, పొలిటికల్ ఎజెండాతో మాట్లాడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో మొత్తం వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థ దగ్గరికి చేరింది. హెరిటేజ్ సంస్థతో భాగస్వామి ఉన్న కొన్ని కంపెనీలు కూడా, తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేశాయి అనే విషయం బయటపడింది. ఆ బయట పడిన తర్వాత ఈరోజు ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న అంశం, బయట పడిన తర్వాత హెరిటేజ్ సంస్థ నుంచి వివరణని ఆశించాం. హెరిటేజ్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ కి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి పేరు ఉంది. బయట రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో హెరిటేజ్ ని నిషేధించడం. హెరిటేజ్ పైన ఫైన్లు వేయడం జరిగింది. బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం క్వాలిటీ ప్రొడక్ట్స్ ని అమ్ముతున్న చరిత్ర హెరిటేజ్ కి ఉంది అంటూ, నిన్నే నేను ఒక వీడియో చేసి చెప్పా. సో అటువంటి హెరిటేజ్, ఇక్కడ ఒక వివరణ ఇయ్యాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పా. ఆ అంశం పైన వివరణలో భాగంగా హెరిటేజ్ కి సంబంధించిన భాద్యురాలుగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిన్న మీడియా ముందుకు వచ్చి దాదాపు ఐదు నిమిషాల నిడివి గల ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో బహుశా వివరణ ఏమో అనుకొని మొత్తం వీడియో చూస్తే ఆ వీడియోలో ఎక్కడ కూడా వివరణ కనపడలేదు, వివరణ లేకుండా కేవలం ఒక ఐదు నిమిషాల వీడియో ఇచ్చారు, ఈ ఐదు నిమిషాల వీడియోలోనూ హెరిటేజ్ సంస్థ మూడు దశాబ్దాలుగా పని చేస్తుంది, హెరిటేజ్ సంస్థ ఇంతమంది రైతుల్ని పోషిస్తోంది, హెరిటేజ్ సంస్థతో ఇంతమందికి అనుబంధం ఉంది, హెరిటేజ్ సంస్థలో 500 మంది నిపుణలు ఉన్నారు. వాళ్ళంతా చెక్ చేసిన తర్వాతే ప్రొడక్ట్స్ వస్తాయి, ఇలా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఎబిలిటీస్ గురించి చెప్పే ప్రయత్నం ఐదు నిమిషాల వీడియోలో ఉంది తప్ప, హెరిటేజ్ పైన వచ్చిన అనుమానాలు ఏంటి, హెరిటేజ్ పైన వచ్చిన అనుమానాలకు సంబంధించి, ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, వాటిని క్లియర్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం మాత్రం జరగలేదు. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో..!


