వివేక హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీబీఐ విచారణ జరిగింది.

వివేక హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీబీఐ విచారణ జరిగింది. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో సీబీఐ విచారణ తప్పుదోవ పడుతోందని ఆరోపించారు అవినాష్ . నేను ఎలాంటి తప్పు చేయలేదన్న అవినాష్ ..ఎంత దూరమైన న్యాయపోరాటం చేస్తానన్నారు . విచారణ సమయంలో ఒక ల్యాప్ టాప్ మాత్రమే పెడుతున్నారు..ల్యాప్ టాప్ రికార్డింగ్ చేస్తున్నారో లేదో తెలియదన్నారు. సీబీఐ వాళ్లు మా సోదరికి సమాచారం ఇస్తున్నారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

వివేకాకు ఓ మహిళతో 2006 నుంచి సంబంధం ఉంది వారికి షేక్ షహన్షా అనే అబ్బాయి కూడా పుట్టాడు . ఇంట్లో డాక్యుమెంట్ల కోసం కొందరు వెతికారు అని అన్నారు అవినాష్, ఆస్తి తగాదాల కోసమే హత్య జరిగినట్లు భావిస్తున్నా నన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖను సునీత భర్త మధ్యాహ్నం వరకు ఎవరికి ఇవ్వలేదన్నారు. తను ఎప్పుడు గుండెపోటు అని చెప్పలేదన్న అవినాష్ ..ఇది అప్పటి టీడీపీ ప్రభుత్వం సృష్టించిన కట్టు కథ ..నేనే పోలీసులకు సమాచారం అందించాను అని అవినాష్ రెడ్డి తెలిపారు.

Updated On 10 March 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story