Rape and murder: అభం.. శుభం తెలియని ఏడేళ్ల బాలికపై రేప్, మర్డర్... చెరువులో దూకి నిందితుడు కూడా..!
Rape and murder: అభం.. శుభం తెలియని ఏడేళ్ల బాలికపై రేప్, మర్డర్... చెరువులో దూకి నిందితుడు కూడా..!

బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్నా యువకుడు శవమై తేలాడు. పోలీసుల నుంచి పారిపోయిన కులవర్ధన్ ఓ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబల కోట మండలం కనసానివారిపల్లి దగ్గర చెరువులో నిందితుడి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. పోలీసులు పాప కోసం మూడు రోజులుగా గాలిస్తుండగా.. పొరుగింట్లోనే చిన్నారి మృతదేహం లభించడం కలకలం రేపింది. బాలికను దారుణంగా చంపి డ్రమ్ములో దాచాడు పొరుగింటి యువకుడు. బాలికకు మాయమాటలు చెప్పి, చాక్లెట్ ఆశజూపి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మదనపల్లి పట్టణ శివార్లలోని నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో నివసిస్తున్న దంపతుల ఏడేళ్ల కూతురు సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయింది. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
విచారణ చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివసించే కులవర్దన్ అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బాలికను గొంతు నులుమి హత్య చేసి.. మృతదేహాన్ని డ్రమ్లో కుక్కాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు. విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి తల్లిడండ్రులు గుండెలు అవిసేలా రోదించారు.
అయితే పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయిన కులవర్దన్ ఓ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ
''చిన్నారి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కులవర్ధన్ మృతదేహంగా గుర్తించాం. కులవర్ధన్ మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించామని, కులవర్ధన్ బంధువులు వచ్చాక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. మంగళవారం కులవర్దన్ ని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళుతుండగా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడన్నారు. అతని ఆచూకీ కోసం మూడు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని, బుధవారం ఉదయం కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో కులవర్ధన్ తేలాడు తున్నట్లు మృతదేహం లభించిందని ఎస్పీ ధీరజ్ వెల్లడించారు.


