నాన్నా జాగ్రత్తా... చేతిపై రాసుకొని టీచర్ ఆత్మహత్య..!

అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఓ టీచర్ చేతిమీది రాత..! ఆత్మహత్యకు ముందు తండ్రి గురించి ఆందోళన..!

చేతిపై రాసుకుని, ఉరి వేసుకుని టీచర్ ఆత్మహత్య! ఏపీలోని మార్కాపురం జిల్లా పామూరు మండలం అయ్యవారిపల్లిలో హృదయ విదారక ఘటన. పామూరులో టీచర్‌గా పని చేస్తోన్న మాధవి(24) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నాగూర్ భాష అనే వ్యక్తితో పరిచయం పెరిగి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో అతనికి ఇదివరకే పెళ్లయిందని తెలుసుకుని మాధవి దూరం పెడుతుండడంతో.. తమ వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన యువకుడు. దీంతో మనస్తాపం చెందిన టీచర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. చనిపోవడానికి ముందు 'నాన్న జాగ్రత్త' అని చేతిపై రాసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగూర్ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

Updated On
ehatv

ehatv

Next Story