గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఎంపిక చేసిన కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోందని.. దీన్ని ఆపాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కోరారు. 'ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్' క్లియరెన్స్ విధానాన్ని అనుసరించకుండా కొంతమంది కాంట్రాక్టర్లకు భారీ మొత్తాలను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని విశ్వసనీయంగా తెలిసిందని మంగళవారం గవర్నర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం డిబిటి కింద సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయకుండా వివిధ కాంట్రాక్టర్లకు భారీ మొత్తాలను విడుదల చేసిందని ఆరోపించారు. ఆర్‌బిఐ, బ్యాంకుల నుండి రుణాలతో రాష్ట్రం మనుగడ సాగిస్తోందని అన్నారు.

పదవీ విరమణ ప్రయోజనాలు, ప్రావిడెంట్ ఫండ్ వాపసు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల క్లియరెన్స్‌తో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల విడుదలకు సంబంధించిన అనేక హామీలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. 8,000 కోట్ల నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. APMDC బాండ్ల ద్వారా రూ. 4,000 కోట్లు, రూ. 7,000 కోట్లు సేకరించారు.. అటువంటి డబ్బును కాంట్రాక్టర్లు, పార్టీకి చెందిన నాయకుల స్నేహితుల బిల్లులను క్లియర్ చేయడానికి ఉపయోగిస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated On 15 May 2024 2:18 AM GMT
Yagnik

Yagnik

Next Story