AP Elections: ఏపీ ఎన్నికల్లో ఏం జరిగింది.. ద వైర్ కథనంలో 'పరకాల ప్రభాకర్' సంచలనాలు..!
AP Elections: ఏపీ ఎన్నికల్లో ఏం జరిగింది.. ద వైర్ కథనంలో 'పరకాల ప్రభాకర్' సంచలనాలు..!

ద వైర్ కథనంకి సంబంధించి చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం. ద వైర్ లో పరకాల ప్రభాకర్ ఒక ఆర్టికల్ రాశారు. ఫిబ్రవరి 14 న ఆయన రాసిన ఆర్టికల్కు సంబంధించిన రకరకాల చర్చలు, విశ్లేషణలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపైన, ఎన్నికల కమిషన్ సంబంధించిన విశ్వసనీయత పైన, అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అంశానికి సంబంధించి కూడా ఈవీఎంలు మేనేజ్ చేశారు అని అనుమానం కలగడానికి సంబంధించిన ఇంప్రెషన్ ఎలక్షన్ కమిషన్ ఇస్తోంది, అక్కడ ఎన్నికల్లో ఏదో అవకతవకలు జరిగాయని అనే దానికి సంబంధించిన ఆధారాలని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతుంది అనేది, ఆయన చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ వచ్చారు. వైర్లో కొత్తగా రాసింది ఏంటి వైర్ లో కొత్తగా రాసిన దాని పైన ఇంత చర్చ ఎందుకు అంటే, వైర్లో ఆయన రాసిన ప్రతి అక్షరం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట మాత్రమే ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది, జరిగిందో మీకు అర్థమవుతుంది అంటూ చెప్తున్నారు ఆయన. అంతే కాదు, ఆయన రైజ్ చేస్తున్న అంశాలు, ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పిన అంశాలని క్రోడీకరించి చెప్పిన మాటల ప్రకారం చూస్తే, అయ్యో ఇంత జరిగిందా ఇలా, ఎలా జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఏం జరిగింది అసలు రకరకాల టెక్నికాలిటీస్, టెక్నికల్ ఇష్యూస్ వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ సాయంత్రం 5ు గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ 13వ తారీకు మే 13 2024 ఎన్నికల పోలింగ్ జరిగితే, సాయంత్రం 5 గంటల తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత, క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామంటూ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎప్పుడైనా అంతే ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన సమయం ముగిసిపోయిన తర్వాత ఎవరైతే ఆ పోలింగ్ కాంపౌండ్ లోపల ఉంటారో వాళ్ళకి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. అలా అవకాశం కల్పించాము 5:00 గంటల వరకు 68%కి పైగా ఓటింగ్ నమోదయింది ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ ముగిస్తే, తెల్లవారుజామునరెండు గంటల వరకు పోలింగ్ జరిగింది, చివరి ఓటు తెల్లవారుజామున రెండు గంటలకు పోల్ అయింది అని , ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్న మీనా ప్రకటించారు. ఆయన ప్రకటించిన దాని ప్రకారం 9 గంటల పాటు ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు మామూలుగా ఓటింగ్ ఎనిమిది గంటలు జరిగింది. మొత్తం రెగ్యులర్ పోలింగ్ ఎనిమిది గంటలు జరుగుతుంది. అది కాకుండా 5దు గంటల తర్వాత 9 గంటల పాటు క్యూ లోన్ లో నిలబడి 52 లక్షల మంది ఓట్లు వేశారు ఇది సాధ్యమా, కాదా అనే ప్రశ్న సాధారణంగా రైజ్ అవుతుంది. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పాల్సి ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన దాని ప్రకారం, ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారమే చూస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ పర్సెంటేజ్ 68.04 గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఎనిమిది గంటలకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది 68.12% 2 శాతం నమోదయింది, పోలింగ్ అప్పటికి అని చెప్పింది. అంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈమూడు గంటలలో కేవలం 00.08% మాత్రమే పోలింగ్ జరిగినట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆ తర్వాత రాత్రి 11:45 కి ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం 76%, 76.50% , పోలింగ్ నమోదు అయినట్లుగా చెప్పింది అంటే దాదాపు మరొక 8% పోలింగ్ 8 గంటల నుంచి 11:45 మధ్యలో జరిగినట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ 17వ తారీకు 13వ తారీకు రాత్రి 2 గంటలకు పోలింగ్ పూర్తయితే, 17వ తారీఖున ఎలక్షన్ కమిషన్ చెప్పింది, పూర్తిగా ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పింది 81.86% ఓటింగ్ నమోదయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని . ఎన్నికలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత చెప్పింది సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన పోల్ పర్సెంటేజీ ఈరోజు జరిగితే, రాత్రికో, లేకపోతే పొద్దునకో, రేపు మధ్యాహ్నానికో చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. నిజానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడడం మొదలైన తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ ఎన్నికలు ముగిసిన తర్వాత 12 గంటలకో. 24 గంటలకో ఇవ్వడం చూస్తున్నాం. దీనిపై పరకాల ప్రభాకర్ లేవనెత్తిన అంశాలు, విశ్లేషణ ఈ వీడియోలో..!


