Mother Killed his Daughter: ఎందుకమ్మా ఇలా చేశావ్..! నీ ప్రియుడి మోజులో పడి రెండేళ్లు ఉన్న నన్నే చంపేస్తావా..! నీకు దయ లేదా అమ్మా..!
Mother Killed his Daughter: ఎందుకమ్మా ఇలా చేశావ్..! నీ ప్రియుడి మోజులో పడి రెండేళ్లు ఉన్న నన్నే చంపేస్తావా..! నీకు దయ లేదా అమ్మా..!

వివాహేతర సంబంధాలు పెట్టుకొని కనిపెంచుకున్న కన్నవారినే మట్టుబెట్టుతున్నారు నేటి కాలం మహిళలు. ఓ వైపు నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసికందు కుల అహంకారంతో చనిపోతే లోకమంతా ఏకమై నిలిచింది. మరోవైపు తిరుపతిలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారి పునర్వికకు జీవం పోసేందుకు తలా ఒక చేయి వేసి ఆ పాప ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఏకమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరి చిన్నారుల గాథ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక్కడే ఓ కర్కశురాలు రెండున్నరేళ్ల చిన్నారిని బలితీసుకుంది. కామంతో కళ్లు ముసుకుపోయి, జాల్సాలకు అలవాటు పడ్డ ఓ మహిళ తాను కనిపెంచిన రెండున్నరేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా చంపి ఈ సమాజంలో తల్లి అనే పదానికి మర్చిపోలేని మచ్చ తెచ్చింది.
తిరుపతికి చెందిన ఆశాలత భర్త రాజేష్తో విడిపోయి తిరుపతి పోస్టల్ కాలనీలో ఉంటోంది. ఆశాలతకు రెండున్నరేళ్ల కుమార్తె దుర్గ ఉంది. ఈమెకు ఏర్పేడు మండలం, చెన్నంపల్లి దళితవాడకు చెందిన రెడ్డికుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రెడ్డికుమార్ను పెళ్లి చేసుకోవాలని, ఇందుకోసం అడ్డుగా ఉన్న తన కుమార్తె దుర్గను అంతమొందించాలని భావించింది. ఈ నెల 19వ తేదీన కూతురైన దుర్గను అతికిరాతకంగా చంపేసింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రియుడు రెడ్డికుమార్ సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బైక్పై తీసుకుని ప్రియుడి గ్రామానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో గొయ్యిని తవ్వి పాతిపెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో అవ్వ ప్రశ్నించింది. తల్లి సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన స్థానికుల హృదయం కలిచివేసింది. ఆ రెండు నిమిషాల సుఖం కోసం రెండున్నరేళ్ల పాపను ఎలా చంపాలని అనిపించిందో అని వారు గాయపడిన మనసుతో ప్రశ్నిస్తున్నారు.


