EENADU, ANDHRAJYOTHI: ఈనాడు, ఆంధ్రజ్యోతి మౌనమెందుకు..!
EENADU, ANDHRAJYOTHI: ఈనాడు, ఆంధ్రజ్యోతి మౌనమెందుకు..!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం సంబంధించిన వివాదం చూస్తున్నాం. ఆయన విమానం క్రాష్ ల్యాండింగ్ సందర్భంగా మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబానికి పెద్దగా ఉన్న మహారాష్ట్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్ శరద్ పవార్ ఈ ప్రమాదం వెనక ఎలాంటి అనుమానాలు లేవు, ఎలాంటి కుట్రలు లేవు, ఇది ప్రమాదంగానే చూస్తున్నాం, దీనిలో కుట్ర కోణాన్ని మేము ఎక్కడా చూడట్లేదు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత వారం 10 రోజుల తర్వాత ఈ అంశంపైన శరత్ పవార్ వర్గానికి సంబంధించిన, అజిత్ పవార్ బంధువు, రోహిత్ పవార్ ఒక సంచాలన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పారు. ఆయన ప్రస్తుతం శరద్ పవార్ వర్గం నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు. శరత్ పవార్ కుటుంబ సభ్యుడు అజిత్ పవార్ కి దగ్గర బంధువు ఆయన, కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే, నేరుగా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని టార్గెట్ గా చేసుకొని ఆయన ఆరోపణలు చేశారు. ఏ విమానం అయితే వీఎస్సార్ సంస్థకు సంబంధించిన విమానం ఉందో, ఆ సంస్థతో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అధినేతకు సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అధినేత నివాసానికి, హైదరాబాద్ లో దగ్గరలోనే ఆ కంపెనీకి సంబంధించిన ఎయిర్లైన్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఆస్తులు ఉన్నాయి అంటూ ఆయన కొన్ని ప్రకటనలు చేశారు. రామ్మోహన్ నాయుడు ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ కూడా జరగకముందే సదరు విమానాయాన సంస్థకు క్లీన్ షీట్ ఇచ్చారు. ఏ ఆధారాలతో ఆయన క్లీన్ చీట్ ఇచ్చారు, విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ కాలిపోయింది అని చెప్తున్నారు, విమానంలో బ్లాక్ బాక్స్ కాలిపోవడం ఏంటి, ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ బ్లాక్ బాక్స్ కాలిపోకుండా ఉంటుంది , అటువంటి మెకానిజం దానిలో ఉంటుంది, సో ఆ స్థాయిలో ఎంత వేడినైనా తట్టుకోగలిగే స్థాయిలో ఉంటుంది, బ్లాక్ బాక్స్ దాంట్లో అక్కడ ఏం జరిగింది కాక్పిట్లో అనేది మొత్తం అంతా రికార్డు అయి ఉంటుంది., అది లేదు కాలిపోయింది లాంటి ప్రకటనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి. పైగా విచారణ జరగకముందే రామ్మోహన్ నాయుడు ఆ సంస్థకు క్లీన్ చీట్ ఎలా ఇస్తారు అనేది ఆయన రైజ్ చేస్తున్న అంశం. ఈ వ్యవహారం పైన విచారణ పూర్తిగా స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు, ఈ విచారణ జరిగే వరకు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుని పదవి నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఎవరి పైనైతే మేము అనుమానం వ్యక్తం చేస్తున్నామో, ఎవరి పైనైతే మాకు అనుమానాలు ఉన్నాయి, ఎవరి పైనైతే మేము ఆరోపణలు చేస్తున్నామో, విమానాయన సంస్థ, ఆ సంస్థకు రామ్మోహన్ నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అధినేతో తెలుగుదేశం పార్టీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కాబట్టి రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఈ అంశం పైన జరిగే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం మాకు లేదు కాబట్టి, కేంద్ర క్యాబినెట్ నుంచి ఆయన తొలగించే ఆ పదవి నుంచి విచారణ చేయాలనేది ఒక శాసన సభ్యుడు, ఆ కుటుంబానికి సంబంధించిన ఒక శాసన సభ్యుడు చేస్తున్న డిమాండ్. ఈ డిమాండ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన తెలుగు మీడియాలో అసలు వార్తే కనపడట్లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసమే పని చేస్తున్నామ అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని పనిచేసే మీడియా ఈ వార్తను ఎక్కడ కవర్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మౌనంపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!


