ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)లను పోలీసులు అడ్డుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)లను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎన్‌.రఘువీరారెడ్డి(N.Raghu Veera reddy) తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. బాధితులను పరామర్శించడం రాహుల్‌గాంధీ కర్తవ్యమని, బీజేపీ(BJP) ఎందుకు అడ్డుకుంటున్నదని రఘువీరా నిలదీశారు. బీజేపీ ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు రఘువీరా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story