కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ(Mudragada Padmanabha) ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ(Mudragada Padmanabha) ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డి. ఈ మేరకు ఆంధ్రప్రదేశఖ్‌ గెజిట్‌లో ప్రచురణ కూడా అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్‌ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) విజయం సాధించారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ పద్మనాభం తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఆయన పేరు మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్‌ విడుదలైంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story