- Home »
- andhra pradesh »
- Ys Jagan Mohan Reddy Memantha Siddham Bus Yatra Today Schedule
Memantha Siddham: సీఎం జగన్ నేటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు
- Written By: Yagnik Published Date - Fri - 19 April 24
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు మంచి స్పందన వస్తూ ఉన్న సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ విడుదల చేసింది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
మేమంతా సిద్ధం బహిరంగ సభ కాకినాడ జిల్లాలోని రూరల్ నియోజవర్గ పరిధిలో అచ్చంపేట జంక్షన్ వద్ద నేడు జరగనుంది. ప్రజలు విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. బహిరంగ సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందన్నారు వైసీపీ నాయకులు. సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
-
Killing patients with insulin: రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్.. నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
-
Revanth Reddy : ఆ కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టలేదు
-
Traffic Signals : ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్నెట్స్.. ఎండ నుంచి ప్రజలకు ఉపశమనం!
-
PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై కమెడియన్ పోటీ!
-
Sridevi’s Home: అందాలతార శ్రీదేవి భవంతిలో మనం కూడా ఉండొచ్చు!
-
AP Pensions: ఏపీలో వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పింఛన్లు
-
SUN Effect: ఎండలు మరింత పెరగవచ్చు.. హెచ్చరించిన వాతావరణశాఖ