YS Jagan Tweet: కౌంటింగ్ కు ముందు వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ కీలక సూచన
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు ఏపీ సీఎం జగన్మోహన్

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు ఏపీ సీఎం జగన్మోహన్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పార్టీ నాయకులకు ఒక సందేశాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్పూర్తిని చాటారన్నారు.. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్పూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమకు వేసిన ప్రతి ఓటును వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడేలా అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలా చేసి వైసీపీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానన్నారు.
"ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను." అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.


