షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.

షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌తో మాకేంటి సంబంధమన్నారు. షర్మిలమ్మ అప్పట్లో క్రియాశీలకంగా ఉందని చేశారేమో.. అసలు చేశారో లేదో మాకేలా తెలుస్తుందని అన్నారు. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఫోన్​ ట్యాపింగ్​ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్​, నా భర్త ఫోన్​, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్​ చేశారని.. అసలు, ఫోన్​ ట్యాప్​ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్​ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్​ ట్యాపింగ్​ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు వైఎస్‌ షర్మిల.

ehatv

ehatv

Next Story