- Home »
- andhra pradesh »
- Ys Sharmila Got Notice From Election Commission Of India
YS Sharmila: వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు
- Written By: Yagnik Published Date - Sat - 20 April 24
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. షర్మిల తన ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. షర్మిలపై వైసీపీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి, వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం షర్మిలకు నోటీసులు పంపింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.
వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
-
Killing patients with insulin: రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్.. నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
-
Revanth Reddy : ఆ కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టలేదు
-
Traffic Signals : ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్నెట్స్.. ఎండ నుంచి ప్రజలకు ఉపశమనం!
-
PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై కమెడియన్ పోటీ!
-
Sridevi’s Home: అందాలతార శ్రీదేవి భవంతిలో మనం కూడా ఉండొచ్చు!
-
AP Pensions: ఏపీలో వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పింఛన్లు
-
SUN Effect: ఎండలు మరింత పెరగవచ్చు.. హెచ్చరించిన వాతావరణశాఖ