కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. బెంగళూరు(Bengaluru)లోని పూర్ణ ప్రజ్ఞా లేఅవుట్లో ఉన్న ఓయో హోటల్(OYO Hotel)లో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినప్పటికీ, హోటల్ సిబ్బంది ఆదివారం పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది. హతురాలు హరిణి (Harini)(36) అని గుర్తించగా, ఆమె ప్రియుడు యశస్(Yashas) (25) సాఫ్ట్వేర్ ఇంజనీర్ కత్తితో పొడిచి హత్య చేశాడని తేలింది. వివరాల్లోకి వెళ్తే..!
బెంగళూరులోని కెంగేరి(Kengeri)కి చెందిన హరిణి(36), దాసేగౌడకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ కెంగేరిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని నెలల క్రితం కెంగేరిలో జరిగిన ఈ జాతరకు హరిణి వెళ్లింది. అక్కడే ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ యశస్ కూడా ఇదే జాతరకు వెళ్లడంతో.. అక్కడ హరిణిని చూశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసి.. పరిచయం ఏర్పర్చుకున్నాడు అంతేకాదు.. జాతరలోనే ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తరువాత వారి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం.. ఇక ఏమవుతుందో తెలుసు కదా.. ప్రేమ.. పెళ్లి.. కానీ ఆమెకు అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలుండడంతో.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం హరిణి భర్త దాసేగౌడ(dase goud)కు కూడా తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. అనంతరం, దాసేగౌడ.. ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకుని.. వారి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. దీంతో, హరిణి తన తప్పును తెలుసుకుని.. భర్త వద్ద కన్నీరుపెట్టుకుని క్షమించాలని కోరింది. ఆమెను నమ్మిన భర్త.. ఫోన్ ఇవ్వడంతో.. మళ్లీ హరిణితో యశస్ కాంటాక్ట్లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్ చేసి బెంగళూరులోని ఓ హోటల్ గదికి పిలిచాడు. హరిణి.. ఇద్దరు పిల్లల తల్లి, తన కుటుంబ ఒత్తిడి కారణంగా యశస్తో సంబంధాన్ని ముగించాలనుకుంది. ఆమె ఈ విషయాన్ని యశస్కు తెలియజేయడంతో అతనిలో ఆగ్రహం పెరిగి కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత యశస్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి సుబ్రహ్మణ్యపుర పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. విచారణలో భాగంగా యశస్ను పోలీసులు అరెస్ట్ చేశారు
