గుత్తి రైల్వే జంక్షన్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రైన్లో సీట్ కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని నడుస్తున్న రైలు నుంచి బయటికి తోసేశారు తోటి ప్రయాణికులు. పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

A man pushed out of from a running train
గుత్తి రైల్వే జంక్షన్(Gooty railway Junction) లో దారుణం చోటుచేసుకుంది. ట్రైన్(Train)లో సీట్(Seat) కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని నడుస్తున్న రైలు నుంచి బయటికి తోసేశారు తోటి ప్రయాణికులు. పద్మావతి ఎక్స్ప్రెస్(Padmavathi Express) ట్రైన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీటు కోసం ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుండగా.. సర్ది చెప్పేందుకు వెళ్లిన యువకుడిని ట్రైన్ నుంచి కిందకు తోసేశారు. తోసేసిన వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్టు బాధితుడు చెబుతున్నాడు. గుత్తి ఆసుపత్రి(Guthi Hospital)లో చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు(Railway Police) దర్యాప్తు చేస్తున్నారు.


