Shociking Reasons: చర్లపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య..! కారణాలు తెలిస్తే షాక్..!

చర్లపల్లిలో తల్లి, కూతురు, కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసింది. ఫ్యామిలీ సూసైడ్కు గల కారణాలను చూసి పోలీసులు షాక్ తిన్నారని సమాచారం. ఎందుకు ఈ ఆత్మహత్యలు అని ఆరా తీయగా వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయని సమాచారం. డబ్బు, చదువు, మంచి ఉద్యోగం, సుఖంగా సాగిపోతున్న సంసారం, ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు.. ఇంకేం రోగం?? మానసికఅనారోగ్యం.. చాలా బలంగా కనబడాలనే తాపత్రయంతో ఎన్నో సౌకర్యాలు, సుఖాలు పోగేసుకుంటున్నాం కానీ అసలైన మానసిక బలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఈ ఒక్క సంఘటనతో నిజమే అనిపిస్తుంది. మంచి ఉద్యోగం,తన కింద ఓ ఇరవై మంది పని చేస్తున్నారు. భర్త కూడా నాలుగు చేతులా సంపాదిస్తున్నారు దుబాయ్ లో.. అత్తమామలు, అమ్మానాన్నలు, చుట్టాలు అందరూ బాగానే ఉన్నారు.మరేం బాధ? కాకపోతే కొన్ని రోజుల క్రితం పెంపుడు కుక్క చనిపోవడంతో కొంత బాధలో ఉందట.. పిల్లలు హాస్టల్లో పెద్ద చదువుల కోసం కృషి చేస్తున్నారు. అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపించింది.. రైలు పట్టాలు పట్టుకుని గంటన్నర నడిపించింది పిల్లల్ని..ఏం చెప్పిందో, ఎందుకు విన్నారో గానీ పిల్లలు కూడా తల్లితో గూడ్స్ రైలు కింద పడి చనిపోయారు.. ఎన్నో బాధలు ఉన్నా, దిగమింగుకుని పిల్లల కోసం బ్రతికే వారు ఎందరో ఉన్నారు. అందులోనూ కటిక పేదరికంలో ఉండేవారే ఎక్కువ సహనవంతులు అనిపిస్తున్నారు. సమాజం పిల్లల గురించి ఆలోచిస్తూ ఏది ఏమైనా చావు దాకా బలవంతంగా వెళ్ళడం ముమ్మాటికీ తప్పే..తనతో పాటు పిల్లల జీవితాలను ముగించేయడం మహాపాపం కూడా!! దయచేసి ఏదైనా మానసిక అనారోగ్యం, టెన్సన్స్, సమస్యలు ఉంటే స్నేహితులతో మాట్లాడటం, భాగస్వామితో చర్చించడం, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అవేమీ లేకుండా ఇలాంటి అర్థాంతర వికృతాలు మాత్రం చేయకండని నిపుణులు చెప్తున్నారు.


