Husband Dead in Accident, Actual Twist is: హనీమూన్‌కు వెళ్లిన దంపతులను ఢీకొన్న వాహనం.. భర్త మృతి, భార్య బతికింది.. అసలు ట్విస్ట్ ఇదే..!

ఆ దంపతులకు వివాహం జరిగి మూడు నెలలైంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. హనీమూన్‌కు కూడా వెళ్లారు. ఓ ఫైన్ ఈవెనింగ్ ఇద్దరూ కలిసి వాకింగ్‌కు వెళ్లారు. ఇంతలోనే వెనుక నుంచి ఓ వాహనం రయ్య్‌న దూసుకొని వచ్చి వీళ్లను ఢీకొంది. భర్త స్పాట్‌లోనే చనిపోయాడు. కానీ భార్య మాత్రం దూరంగా పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు ఇద్దరు దంపతులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే భర్త చనిపోయాడు, భార్య మాత్రం ప్రాణాలతో బయటపడింది. భర్త మృతదేహాన్ని చూసి భార్య విలవిలాడిపోయింది. పెళ్లయిన మూణ్ణాళ్లకే భర్తను పోగొట్టుకున్న బాధలో భోరున విలపించింది. తనకు దేవుడు అన్యాయం చేశాడని, బంగారంలాంటి భర్తను తన నుంచి దూరం చేశాడన్న బాధ తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా భోరున ఏడ్చింది. భార్య కన్నీటి పర్యంతాన్ని చూసిన స్థానికులు కూడా అయ్యో పాపం.. చిన్నవయసులోనే భర్తను పొగొట్టుకొందని ఓదార్చారు. దేవుడు కూడా ఆమెకు అన్యాయం చేశారని ఆవేదన చెందారు. ఈ ఘటనను హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. భార్య తన చెవిపోగులను కూడా ఎవరో తీసుకెళ్లారని చెప్పడంతో పోలీసులకు ఇది ఒక్క క్లూ చాలు అనుకున్నారు. విచారిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

ఇక్కడే అసలు ట్విస్ట్..!

రాజస్థాన్‌ శ్రీగంగానగర్ జిల్లాలో మరో హనీమూన్‌ మర్డర్‌ కేసు బయటపడింది. పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త అశీశ్‌ను ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి కిరాతకంగా హత్య చేయించింది భార్య అంజూ. అంతేకాదు.. కేసును హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా క్లోజ్‌ చేయించేందుకు ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు.

అశీష్‌-అంజూలు జంటగా.. సాయంత్రం షికారు పేరుతో వాకింగ్‌ చేస్తున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంజూ(అంజూ ప్రియుడు) అశీశ్‌పై బలంగా దాడి చేశాడు. కింద పడిపోయిన అశీల్‌ను రాకీ (రోహిత్), బాదల్ (సిద్ధార్థ్) గట్టిగా పట్టుకోగా.. సంజూ-అంజూలు ఊపిరి ఆగేదాకా గొంతు నులిమారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అశీష్‌ మృతదేహాన్ని తమ వాహనంతో బలంగా ఢీ కొట్టి దూరం పడిపోయేలా చేశారు. ఆపై తన ఒంటిపై ఉన్న నగలను ప్రియుడికి ఇచ్చింది. రోడ్డుకు ఓ పక్కన పడిపోయినట్లు నటించింది భార్య అంజూ. అయితే పోలీసుల విచారణలో తన చెవిపోగులు పోయాయి అని చెప్పడంతో పోలీసులకు ఎక్కడో కొట్టింది. పోలీసులు అంజూ ఇన్‌కమింగ్ కాల్స్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ను పరిశీలించగా ఓ వ్యక్తితో చాలా సార్లు మాట్లాడినట్లు తేలింది. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్య అంజూనే ప్రియుడితో కలిసి చంపించిందని నిర్ధారణ అయింది.

అశీశ్‌తో తనకు వివాహం ఇష్టం లేదని.. పెద్దల బలవంతం మేరకే చేసుకున్నానని.. పెళ్లి తర్వాత ఓరోజు సంజూ ఇంటికి వెళ్లి తన భర్తను అడ్డు తొలగించుకోవడం గురించి మాట్లాడుకున్నామని.. ఈ ప్లాన్‌ను సంజూ తన స్నేహితులతో అమలు చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాలని ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్‌ అండ్‌ రన్‌గా కేసు నమోదు చేసుకోవడంతో తన పని తేలిక అయ్యిందని భావించానని.. కానీ, పోలీసుల విచారణలో కంగారులో తడబడ్డానని అంజూ చెప్పుకొచ్చింది. దీంతో.. కేసును హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్‌ భార్య అంజు, ఆమె ప్రియడు సంజు, సంజూ స్నేహితులు రాకీ, బాదల్‌ను అరెస్టు చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story