Love Failure: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. దగ్గరై మోసం చేసి..!

ఓ యువతిని ప్రేమించి మోసం చేశాడో యువకుడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ అతి దగ్గరగా మెలిగారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని మత్స్యగిరిని ఇటీవల మమత కోరగా అతడు నిరాకరించాడు. ఆదివారం మమత తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లగా.. ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను ప్రే మించిన వ్యక్తి మోసం చేశాడని మమత ఆత్మహత్యకు గల నోట్‌ రాసి, సోదరికి ఫోన్‌ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మమత సోదరి బావి వద్ద నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కని పించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story