చెన్నై(Chennai)లోని ఐసీఎఫ్ సమీపంలో రాజీవ్ గాంధీ నగర్(Rajiv Gandhi Nagar)లో కొంత కాలంగా ఓ జంట రాజీవ్ గాంధీ నగర్లో చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తూ వచ్చారు.

చెన్నై(Chennai)లోని ఐసీఎఫ్ సమీపంలో రాజీవ్ గాంధీ నగర్(Rajiv Gandhi Nagar)లో కొంత కాలంగా ఓ జంట రాజీవ్ గాంధీ నగర్లో చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తూ వచ్చారు. వీరు తమను భార్యాభర్తలుగా పరిచయం చేసుకునేవారు. అయితే, వీరి మధ్య జరిగిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ వివాదం ప్రేమోన్మాద రూపం దాల్చి, దారుణ ఘటనకు దారి తీసింది. ప్రియురాలు రక్తగాయాలతో మృతిచెందగా, ప్రియుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సహజీవనం చేస్తున్న జంట మధ్య వివాదం తీవ్రమై, ప్రియురాలు రక్తగాయాలతో మృతిచెందింది. ప్రియుడు ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కిటికీ వద్ద ఆ ఇంట్లోని యువకుడి మృతదేహం ఉరివేసుకుని శవంగా వేలాడుతుండడాన్ని పొరుగున ఉన్న వారు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లోపల గడియపెట్టి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా రక్తగాయాలతో యువతి మరణించి ఉండడం, అక్కడే యువకుడు కిటికీకి ఉరి వేసుకుని మృతిచెంది ఉండడం వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఆ ఇంట్లో లభించిన గుర్తింపు కార్డులు, ఇతర కార్డుల ఆధారంగా ఆ ఇద్దరి వివరాలను పోలీసులు సేకరించారు. ఈకేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు మృతదేహాలను కీల్పాకం మార్చురీకి తరలించారు. మృతులు ఇరువురు చదువుకుంటూ ప్రాజెక్టు వర్క్ పేరుతో వచ్చి ఇక్కడ సహజీవనం చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. వీరిని విల్లుపురం అన్నా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఆకాశ్, అభినయగా గుర్తించారు. అభినయ ఇంగ్లిష్ లిటరేచర్లో బీఏ(BA), ఆకాష్ బీఎస్సీ(Akash) చదువుతున్నారు. కళాశాలలో ప్రేమించుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు ఒక ప్రాజెక్టు వర్క్ పేరిట చెన్నైకు వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి వచ్చేశారు.
