హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NLB నగర్లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NLB నగర్లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక తేజశ్రీ, తన ప్రియుడు పగిల్ల శివ (Pagilla Shiva)(19), అతని సోదరుడు పగిల్ల యశ్వంత్ ( Pagilla Yashwanth)(18)తో కలిసి తన కన్నతల్లి అంజలి (Anjali)(39)ని హత్య చేసింది. తేజశ్రీ తన ప్రేమ వ్యవహారం గురించి తల్లి అంజలి మందలించడంతో కోపం పెంచుకుంది. తల్లి తన ప్రియుడితో సంబంధానికి అడ్డుగా ఉందని భావించి, హత్యకు ప్లాన్ చేసింది. తేజశ్రీ తన ప్రియుడు శివ, అతని సోదరుడు యశ్వంత్ను ఇంటికి పిలిచింది. వారు అంజలిని గొంతు పిసికి, తలపై ఐరన్ రాడ్తో కొట్టి హత్య చేశారు. ఐదు రోజుల క్రితం తేజశ్రీ (Tejashree)తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయంపై అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది, దీంతో తేజశ్రీ తిరిగి ఇంటికి వచ్చింది. ఈ సంఘటన తల్లి-కూతురు మధ్య గొడవలకు కారణమైంది. జీడిమెట్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తేజశ్రీ, శివ, యశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు.
