Engineering student: ఇంజినీరింగ్ విద్యార్థినిపై కాలేజ్‌ గదిలోనే ఏడాదిగా అత్యాచారం, వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టి..!

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో తోటి విద్యార్థినీ పై ఇద్దరు యువకులు అఘాయిత్యం చేశారని ఆరోపిస్తూ బాచుపల్లి పి.యస్ లో‌ ఫిర్యాదు చేసిన భాదితురాలు.. కేసు నమోదు చేసుకొని‌ దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బీటెక్ విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన యువకుడు. ఆమెను బెదిరించి కళాశాల తరగతి గదిలో అత్యా చారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్న చిత్రాలను పోస్ట్ చేసి ఏడాదిన్నరగా వేధింపు లకు పాల్పడుతున్నాడు. వేధింపులు భరించలేక యువతి.. విషయం తల్లికి చెప్పగా ఆమె ఫిర్యా దుతో బాచుపల్లి ఠాణాలో కేసు నమోదైంది. నిజాంపేటకు చెందిన యువతి(20) బాచుపల్లిలోని వి.యన్.ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీ రింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదు వుతోంది. అదే కళాశాలలో ఆశిష్ తనయ్(20) మరో బ్రాంచ్ చదువుతున్నాడు. తనను ప్రేమిం చాలంటూ ఆశిష్ యువతిని వేధించాడు. ఆమెను బెదిరించి 2023 అక్టోబరులో కళాశాలలోని ఓ గదిలో అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత యువతిని బెదిరించి పలుమార్లు హోటళ్లకు తీసు కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయాల్లో యువతికి చాక్లెట్లలో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. స్పృహ కోల్పోయాక నగ్నంగా ఉన్న వీడియోలు, చిత్రాలు తీసి డార్క్ వెబ్‌లో పెట్టాడు. గతేడాది ఫిబ్రవరి 14న ఆశిష్ అదే కళాశాలకు చెందిన తన మిత్రుడు ప్రవీణ్ (20)ను యువతికి పరిచయం చేశాడు. ఆశిష్ ఉన్న సమస్యను పరిష్కరిస్తానని ఆమెను గండిమైసమ్మ చౌరస్తాలోని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి యత్నించగా తప్పించుకుంది. వీడియోలు, చిత్రాలు బయటకు రాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు వినాలంటూ ఆశిష్ బెదిరిస్తుండడంతో యువతి విసిగిపోయి తల్లికి చెప్పింది. దీంతో ఆమె ఫిబ్రవరి 28న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated On
ehatv

ehatv

Next Story