మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల్ తండాకు చెందిన దరావత్ కిషన్ (42) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ తన భార్య ఇద్దరు కూతుళ్ళను పోషిస్తున్నాడు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల్ తండాకు చెందిన దరావత్ కిషన్( Dharavat Kishan) (42) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ తన భార్య ఇద్దరు కూతుళ్ళను పోషిస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న చిన్న కూతురు పల్లవి(Pallavi) భూక్యా సురేష్ అనే వ్యక్తిని ప్రేమించి తరచూ ఫోన్ మాట్లాడుతుండడంతో తండ్రి కిషన్ మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ప్రియుడితో కలిసి తండ్రి చేతులు కాళ్లు కట్టేసి విచక్షణారహితంగా కొట్టిన భార్య జంగ్ని, కూతుళ్లు రమ్య, పల్లవి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, పరిస్తితి విషమించి తండ్రి కిషన్ మరణించాడు.

రంగారెడ్డి జిల్లా పులిమామిడి గ్రామానికి చెందిన పసుపుల జంగయ్య(Jangaiah) (65)ను తనకున్న అరెకరం భూమి అమ్మాలని కొడుకు శేఖర్ ఒత్తిడి చేశాడు. భూమి అమ్మడానికి నిరాకరించడంతో, అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో తండ్రి తలపై బండరాయితో కొట్టి హత్య చేసిన కొడుకు.

ఇక మరో కేసులో మహబూబాబాద్ (Mahabubabad)జిల్లా సిరోలుకు చెందిన వల్లపు లింగయ్య(Lingaiah) అనే వ్యక్తి మొదటి భార్యకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు వల్లపు కృష్ణ (43) ఉండగా, రెండో భార్యకు ఇద్దరు కొడుకులు నరేష్, మహేష్ ఉన్నారు. తనకున్న 16 ఎకరాల భూమిలో 12 ఎకరాలను ముగ్గురు కొడుకులకు ఒక్కొక్కరికి 4 ఎకరాల చొప్పున ఇచ్చిన లింగయ్య. హైదరాబాద్‌లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండడంతో, తన 4 ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చిన కృష్ణ .కృష్ణ భూమిని కౌలుకు తీసుకున్న వారిని బెదిరించి పొలం సాగు చేయకుండా అడ్డుకున్న నరేష్, మహేష్. ఈసారి ఎలాగైనా తన భూమి సాగు చేయాలని ఊరికి వచ్చిన కృష్ణను కర్రలు, కత్తులతో దాడి చేసి చంపిన నరేష్, మహేష్. ఇలా కుటుంబ సభ్యులే సొంత మనుషులను హత్య చేయడం గమనార్హం.

ehatv

ehatv

Next Story