Extramarital Affair: ఐదేళ్ల వివాహేతర సంబంధం..! చివరికి

ఓ మహిళ భర్తకు దూరంగా ఉంటూ మరో వ్యక్తికి దగ్గరైంది. గత ఐదేళ్లుగా అతనితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో సుజాత పేరుతో ఉన్న ఆస్తిపై ప్రియుడు కన్నేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం రావడంతో హత్యకు దారితీసింది. ప్రియురాలిని హత్య చేసి పరారైన ప్రియున్ని బెళగావి జిల్లా అథణి పోలీసులు ఏపీలో శ్రీశైలంలో అరెస్టు చేశారు. వివరాలు.. అథణి నివాసి కుమార్ కల్లప్ప (34), సుజాత (34) అనే మహిళను చెరుకు తోటలో గొంతు పిసికి చంపి శ్రీశైలానికి పారిపోయాడని జిల్లా ఎస్పీ రామరాజన్ తెలిపారు. 12వ తేదీన కుళ్లిన స్థితిలో మహిళ శవం బయటపడింది. సుజాత భర్తకు దూరంగా ఉంటోంది. కొన్నాళ్లకు కుమార్తో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ 5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. సుజాతకు ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని నిందితుడు ఒత్తిడి చేయగా ఆమె తిరస్కరించింది. కక్ష పెంచుకుని ఈ నెల 7న ఆమెను తన చెరుకు తోటకు తీసికెళ్లి హతమార్చాడు.


