For the insurance money of Rs. 2 crores.. she killed her husband along with her boyfriend..!

నిజామాబాద్‌ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త పల్లటి రమేష్‌ పేరుతో రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. భర్త కష్టపడి కడుతున్న రూ.2 కోట్ల ఇన్సురెన్స్ డబ్బులు తీసుకొని ప్రియుడితో జల్సాలు చేసుకునేందుకు ప్లాన్‌ చేసిందీ మహానటి. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.

పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్‌ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.

దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్‌ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్‌ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం గుండె పోటు అంటూ చిత్రీకరించారు. భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి, ఆయన స్పృహ కోల్పోయక గోంతు పిసికి చంపి గుండుపోటు అని భార్య నమ్మించింది. తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story