పరాయి మగాడితో పరారైన తన భార్యను చంపిన ఘటన మైసూరు(Mysore) చామరాజనగర(Chamarajanagar )లోని సోమవారపేటె బడావణెలో జరిగింది.

పరాయి మగాడితో పరారైన తన భార్యను చంపిన ఘటన మైసూరు(Mysore) చామరాజనగర(Chamarajanagar )లోని సోమవారపేటె బడావణెలో జరిగింది. విద్య (Vidya)(26) అనే మహిళను ఆమె భర్త గిరీష్ హత్య చేసి పరారయ్యాడు. కరినంజనపుర బడావణెకు చెందిన విద్యకు సోమవారపేటె(Somwarpet)కు చెందిన గిరీష్తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. చక్కగా సాగుతున్న వీరి కాపురంలో ఓ పరాయి మగాడు ఎంటరై పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడు. గిరీష్ (Girish)భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని పరారైంది. కానీ తరువాత వాపసు వచ్చిన ఆమెను పుట్టింటివారు, భర్త ఇంటిలోకి చేర్చుకోలేదు. దీంతో ఆమె మహిళా సాంత్వన కేంద్రంలో ఆశ్రయం పొందింది. ఇటీవల తన మొబైల్ను భర్త నుంచి తీసుకుంది. భర్త గిరీష్ సాంత్వన కేంద్రానికి వెళ్లి మొబైల్ వాపసు ఇవ్వాలని గొడవ పడ్డాడు. దీంతో విద్యా తన భర్త గిరీష్ తనను వేధిస్తున్నాడంటూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లా కాలేజీ ఎదుట జాతీయ రహదారిని దాటి మహిళా సాంత్వన కేంద్రానికి వెళుతుండగా ఆమెను అడ్డుకున్న గిరీష్ పదునైన కొడవలితో దాడికి యత్నించాడు. ఆమె చేయిని అడ్డు పెట్టగా బలమైన గాయం కావడంతో రక్తం కారింది. ఆమె భయపడి తప్పించుకునేందుకు పరుగు తీసి ఓ కెఫె ముందు పడిపోయింది. భర్త ఆమె మెడ, భుజనం, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో కెఫెలోని సిబ్బంది దాడిని అడ్డుకునేందుకు ప్రయతి్నంచగా వారిపై గిరీష్ తిరగబడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యా మృతదేహాన్ని అంబులెన్స్లో నగర శివార్లలోని సిమ్స్ బోధనాస్పత్రికి తరలించారు. ఎస్పీ డాక్టర్ బీటీ కవిత, ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ లక్ష్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
