Gold Theft: బ్యాంకులో ఉన్న కిలోల బంగారం మాయం.. దొంగ చేతికి తాళాలిచ్చిన వైనం..!

బ్యాంకులో బంగారం ఉంటే గుండెపై చేయి వేసుకొని హాయిగా నిద్రపోతాం. కానీ బ్యాంకులోనే దొంగతనం జరిగితే కస్టమర్లలో ఆందోళన ఎలా ఉంటుంది. ఇదే జరిగింది. ఓ బ్యాంకులో కస్టమర్లు పెట్టిన బంగారాన్ని మరో చోట తాకట్టు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

బెంగళూరులోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ (34), కస్టమర్ల లాకర్ల నుండి సుమారు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆన్‌లైన్ జూదంలో పాల్గొన్నాడు. అయితే గత నెల 2న కొంతమంది కస్టమర్లు తమ లాకర్లను తనిఖీ చేసినప్పుడు తమ ఆభరణాలు కొన్ని మాయమైనట్లు గుర్తించారు. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వినియోగదారుల ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీలో మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమైనట్టు తేలింది. బ్రాంచ్ మేనేజర్ లేని సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో లాకర్లను తెరిచి ఈ మోసానికి పాల్పడ్డాడు. 2025 జూన్ - 2026 జనవరి మధ్య కాలంలో నిందితుడు కిరణ్ తక్కువ మొత్తంలో బంగారాన్ని దొంగిలిస్తూ వచ్చాడు. అలా క్రమంగా మొత్తం 2,793 గ్రాముల బంగారం (దాదాపు రూ. 4 కోట్లు) మాయం చేశాడు. ఇలా కొట్టేసిన బంగారాన్ని ప్రైవేట్ రుణదాతలకు తనఖా పెట్టి, ఆడబ్బును బెట్టింగ్‌లో వాడేవాడు. దొంగిలించిన బంగారాన్ని కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మిగిలిన బంగారాన్నిరికవరీ చేసేందుకు పోలీసులుప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Updated On
ehatv

ehatv

Next Story