చిట్టీ డబ్బు విషయంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ మహిళ వేలు కొరకగా అది ఊడి కింద పడిన ఘటన హైదరాబాద్లోని మధురానగర్లో చోటు చేసుకుంది.

చిట్టీ డబ్బు విషయంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ మహిళ వేలు కొరకగా అది ఊడి కింద పడిన ఘటన హైదరాబాద్లోని మధురానగర్లో చోటు చేసుకుంది. జవహర్ నగర్కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్ హౌజ్లో మూడేండ్ల నుంచి మమత అద్దెకు ఉండగా.. మమత వద్ద చిట్టీలు వేసిన ఇంటి యజమానురాలు సుజిత. మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉండగా.. ఇటీవల మమత ఆ ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకు ఇప్పించింది. వారం రోజుల తర్వాత ఎవరికి చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి సుప్రియ వెళ్లిపోయింది. చిట్టీ డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి, ఆమె భర్త హేమంత్తో కలిసి మమత వెళ్లింది. ఇంటి అద్దె చెల్లించ కుండా సుప్రియ వెళ్లిందని.. అద్దె డబ్బు ఇవ్వాలని సుజిత పట్టుబట్టింది. ఇద్దరి మధ్య మాటామాట పెగడంతో.. సుజిత తల్లి లత(45) అడ్డురావడంతో ఆమె కుడి చెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు. దీంతో అది ఊడి కింద పడిపోయింది. వెంటనే వేలు తీసుకొని ఆస్పత్రికి పరుగులు పెట్టిన బాదితురాలు. పరిశీలించిన వైద్యులు అతికించలేమని చెప్పారు. నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
