వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు.కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు.

వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు.కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు. నెల్లూరు(Nellore)లోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు ఆత్మహత్య లేఖ రాశారు. ‘‘అమ్మ, నాన్నలు మమ్మల్ని క్షమించండి. మీరు మా ప్రేమను ఎలాగూ అంగీకరించడం లేదు. మళ్లీ పుట్టి అందరి అంగీకారంతో ఒక్కటవుతాం’’ అంటూ రాసి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన నెల్లూరులోని ఒక లాడ్జిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసఫ్ రత్నకుమార్ (Joseph Ratnakumar) (23), కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి(Chillumuntha Sravani) (21) వీరిద్దరూ బీటెక్ చదివే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 21వ తేదీన నెల్లూరు వచ్చారు. కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని చెప్పి ఒక లాడ్జి(Lodge)లో గదిని అద్దెకు తీసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తికాలేదని అదనంగా మరో రోజు గదికి నగదు చెల్లించారు. 23వ తేదీన గదిని శుభ్రం చేసేందుకు లాడ్జి స్వీపర్ వెళ్లి తలుపుకొట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడ నుంచి స్వీపర్ వెళ్లిపోయారు. కానీ సేమ్ సీన్ నెక్స్ట్ డే కూడా రిపీట్ అయిది. శుక్రవారం మధ్యాహ్నం వారు అద్దెకు తీసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ జి.దశరథరామయ్య, ఎస్ఐ బాలకృష్ణ(SI Balakrishna) తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్పై జోసఫ్ రత్నకుమార్, నేలపై శ్రావణి మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో కనిపించాయి. వీరి మృతదేహాల దగ్గర గడ్డిమందు సీసా ఉంది. దీంతో వారు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వారి బ్యాగ్లను పరిశీలించగా అందులో మృతుల ఆధార్ కార్డులు, కళాశాలలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయి. ఇరువురు తమ తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లేఖలను పోలీసులు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రేమ జంట ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
