10 నెలల కన్న కొడుకుకి విషమిచ్చి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి..!

కుటుంబ కలహాలతో 10 నెలల కొడుక్కి విషమిచ్చి హతమార్చి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. కూతురు, మనవడి మరణం తట్టుకోలేక మహిళ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ మీర్‌పేటలో జరిగింది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు సంవత్సరాల క్రితం చార్టెడ్ అకౌంటెంట్ విధులు నిర్వహిస్తున్న యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తిని సుష్మ(27) అనే మహిళ పెళ్లి చేసుకుంది. వీరికి యశ్వవర్ధన్ రెడ్డి(10 నెలల) అనే కుమారుడు జన్మించగా, గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు తెలిపిన కుటుంబ సభ్యులు. ఒక ఫంక్షన్ కోసం షాపింగ్ చేసేందుకు తన తల్లి లలిత(44) ఇంటికి రాగా, అదే సమయంలో వేరే రూముకి వెళ్లి కొడుక్కి విషమిచ్చి, తాను ఆత్మహత్యకు పాల్పడిన సుష్మ. రాత్రి 9:30 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి, బెడ్రూమ్ తలుపు లోపల నుండి పెట్టి ఉండడం గమనించి, తలుపులు పగలగొట్టి చూడగా, విగతజీవులుగా పడి ఉన్న భార్య, కొడుకుని చూసి పోలీసులకి సమాచారమిచ్చిన భర్త యశ్వంత్ రెడ్డి. కళ్ల ముందే విగతజీవులుగా పడి ఉన్న కూతురు, మనవడిని చూసి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుష్మ తల్లి లలిత. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Updated On 10 Jan 2026 7:14 AM GMT
ehatv

ehatv

Next Story