మైలార్ దేవ్ పల్లి మైనర్ బాలుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మైలార్దేవుపల్లిలోని లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మైనర్ బాలుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు.

New angle in Mailardevupalli murder case
మైలార్ దేవ్ పల్లి మైనర్ బాలుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మైలార్దేవుపల్లిలోని(Mailardevupalli ) లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీ(Lakshmi guda Housing Board Colony)లో మైనర్ బాలుడు(Minor Boy) ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసును విచారించిన పోలీసులు పంకజ్ పాశ్వాన్(Pankaj Pashwan) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడు.. తన భార్యపై అత్యాచారానికి పాల్పడటంతో.. అతడిని పథకం ప్రకారం హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. మృతుడు.. తన భార్యను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం కూరగాయలు(Vegitables) కట్ చేసే కత్తి(Knife)తో అతడి గొంతు కోసి హత్య చేసి.. నిర్మానుష ప్రాంతంలో పడేసినట్లు వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు.
