విహారయాత్ర ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా

విహారయాత్ర ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లా ఎర్రవల్లి మండలం మునగాల(Munagala) సమీపంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన ఎర్ర వెంకటబాబ్జి (Erra Venkata Babji)సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న తన భార్య ఎర్ర శ్రావణి (Sravani)(38), పెద్ద కూతురు లక్ష్మీసహస్ర, చిన్న కూతురు సాయిచైత్ర(Sai Chaitra) (7)లతో కలిసి తమ కారులో విహారయాత్ర కోసమని ఊటీకి వెళ్లారు. నలుగురు కుటుంబసభ్యులు అక్కడ సంతోషంగా గడిపారు. గురువారం తెల్లవారుజామున తిరిగి తమ స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలోని మునుగాల శివారులో జాతీయ రహదారిపైలారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. పార్కింగ్‌ చేసి ఉన్న లారీపై ఎలాంటి సూచికలు లేకుండా లేవు. ప్రమాదంలో వెంకటబాబ్జి భార్య ఎర్ర శ్రావణికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్న కూతురు సాయిచైత్రను కర్నూలు(Kurnool) ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన వెంకటబాబ్జి, లక్ష్మీసహస్రలను చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వెంకటబాబ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ehatv

ehatv

Next Story