దాహం వేస్తోంది అంటే మూత్రం తాపించి గ్యాంగ్ రేప్‌

దాహం వేస్తుంది అంటే నోట్లో మూత్రం పోసి గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గులు. నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనానికి వచ్చిన యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి రాత్రి 10 గంటల సమయంలో ఆలయ సమీపంలో బహిర్‌భూమికి వెళ్లగా అక్కడే మద్యం తాగుతున్న స్థానిక ఆటో డ్రైవర్లు, స్థానికులు 7 మంది కలిసి దుస్తులు విప్పి, విచక్షణారహితంగా కొడుతూ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మద్యం సేవిస్తూ ఉదయం 4 గంటల వరకూ ఒకరి తరువాత మరొకరు ఈ ఘాతుకానికి పాల్పడగా దాహం వేస్తుందని అడిగిన ఆ మహిళ నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడికి పాల్పడి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, పుస్తెలు, కమ్మలు దోచుకొని వెళ్లారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, కాపాడాలని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పేరొందిన ఆలయంలో ఇలా జరగడం దారుణమని స్థానికులు అంటున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story