ఫ్రిడ్జ్‌ నుంచి ఐస్‌క్రీమ్‌ కిందపడిందని కోడలిని అత్త మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కోడలు జీవితం చాలించాలనుకుంది.

ఫ్రిడ్జ్‌ నుంచి ఐస్‌క్రీమ్‌ కిందపడిందని కోడలిని అత్త మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కోడలు జీవితం చాలించాలనుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్‌ సమీపంలో జరిగింది. తమిళనాడు(Tamil Nadu)లోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం (Sengundram )సమీపంలోని మెండియమ్మన్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన అశ్విన్‌రాజ్‌ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్‌క్రీమ్‌(Ice Cream) కిందపడిపోయింది. దీంతో అనుప్రియపై ఆమె అత్త ఆగ్రహించింది. అత్త మందలించిందన్న కారణంగా మనస్తాపం చెందిన అనుప్రియ (Anupriya)ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు. ఫ్యాన్‌కు వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ehatv

ehatv

Next Story