Bride's lover Attack on Groom:రిసెప్షన్‌కు వెళ్తున్న వరుడిపై వధువు ప్రియుడి దాడి..! అన్నీ తానై నడిపించిన ''పెళ్లి కూతురు''

తన వివాహ రిసెప్షన్‌కు వెళ్తున్న వరుడిపై వధువు ప్రియుడు కత్తితో దాడి చేయడం కలకలంరేపింది. కర్నాటకలోని చామరాజనగర్‌ జిల్లా కొల్లేగాళ టౌన్‌ పోలీసులు ఛేదించారు. కొళ్లేగాలలోని వేంకటేశ్వర మహల్‌లో గతనెల 30న రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. వరుడు రవీశ్‌ తన గ్రామం నుంచి కారులో వస్తుండగా ఎంజీఎస్‌వీ రోడ్డు వద్ద దుండగులు అడ్డుకొని కత్తితో దాడి చేశారు. గాయపడిన రవీశ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే కొన్ని రోజుల క్రితం అతనికి ఓ యువకుడు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోవద్దని, ఈ పెళ్లి చేసుకుంటే బాగుండదు అని బెదిరించాడు. వధువు కూడా వరుడికి ఏమీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ప్రియుడు దర్శన్‌ దారికాచి వరుడిపై దాడి చేశాడు. ఈ విషయంపై యువతిని ప్రశ్నించగా తాను గతంలో అతన్ని ప్రేమించిన విషయం వాస్తవమేనని, అయితే ఇప్పుడు విడిపోయామని, ఇష్టంతోనే పెళ్లికి అంగీకరించినట్లు పేర్కొంది.

కానీ వరుడు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. కాగా రవీశ్‌పై జరిగిన దాడికి సంబంధించి కేసు దర్యాప్తును చామరాజనగర్‌ ఎస్పీ ముత్తురాజ్‌ ఒక ప్రత్యేక బందానికి అప్పగించారు. కొల్లేగల్‌ డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ శివమాదయ్య, కొల్లేగల్‌ టౌన్‌ ఎస్‌ఐ వర్షలు యువతి ప్రియుడు దర్శన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రియురాలి సూచనతోనే దాడి చేసినట్లు వెల్లడించడంతో ఆమెను కూడా అరెస్ట్‌ చేశారు. దాడికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. వధువుతోపాటు, ఆమె ప్రియుడు దర్శన్, ఒక మైనర్‌ను అరెస్టు చేశారు. గోకుల్, మరో నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొళ్లేగాల తాలూకా కుణగళ్లికి చెందిన ఎల్‌.రవీశ్‌కు కొళ్లేగాల తాలూకాఆ హొసఅణగళ్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.

Updated On
ehatv

ehatv

Next Story