ఫోన్ మాట్లాడొద్దని మందలించడంతో హైదరాబాద్లో ఒక యువతి, అన్నమయ్య జిల్లాలో మరో యువతి ఆత్మహత్య చేసుకున్నారు.

ఫోన్ మాట్లాడొద్దని మందలించడంతో హైదరాబాద్లో ఒక యువతి, అన్నమయ్య జిల్లాలో మరో యువతి ఆత్మహత్య చేసుకున్నారు. ఫోన్ మాట్లాడడం ఎక్కువైందని, తగ్గించుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఉరివేసుకొని యువతులు ఆత్మహత్య చేసుకున్నారు.హైదరాబాద్(Hyderabad)–పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్(Subhas nagar)లో నివాసం ఉంటున్న రాజేష్ కుమార్ (Rajesh Kumar)కుమార్తె తేజస్విని (Tejaswini)(19), గౌతమి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఈ నెల 8వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటలకు తేజస్విని ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నావు తగ్గించాలని మందలించిన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మందలించారని ఆవేదనతో, సోమవారం ఉదయం వారు డ్యూటీకి వెళ్ళాక చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న తేజస్విని.. అన్నమయ్య జిల్లా(Annamayya District) మదనపల్లకి చెందిన గఫూర్, హసీనా దంపతుల కుమార్తె మస్తానీ (Masthani)(16) ఎనిమదవ తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటుంది. పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి, మస్తానీ ఫోన్ మాట్లాడుతుండడంతో మందలించిన తల్లి హసీనా. దీంతో మనస్తాపానికి గురయ్యి, తను వేసుకున్న చున్నీతో బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్న యువతి
