జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 44వ జాతీయ రహదారిపై

Volvo Bus Overturned and Woman Burnt Alive in Jogulamba District
జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. మంటలలో ఒక మహిళ సజీవ దహనమైంది. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతి చెందిన మహిళను మెహిదిపట్నం(Mehadipatnam)కు చెందిన మాలతిగా గుర్తించారు. బస్సు హైదరాబాద్(Hyderabad) నుంచి చిత్తూరు(Chittore)కు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
