భార్యాభర్తల గలీజ్‌ దందాను బయటపెట్టిన పోలీసులు..!

మగవాళ్లను ఆకర్షిస్తుంది భార్య..! భార్య 'రంకు'పనులను వీడియో తీస్తాడు భర్త..!. వీడియోలు బయటపెడతామని బ్లాక్‌మెయిల్..! భార్యాభర్తల గలీజ్‌ దందాను పోలీసులు బయటపెట్టారు. 100 మందికిపైగా పురుషులతో శృంగారం చేసి బెదిరించి దంపతులు లక్షల రూపాయలు వసూలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి భార్య వశపర్చుకుంటుంది. అనంతరం శృంగార చేసిన వీడియోలతో దంపతులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావుపేటకు చెందిన 31 ఏళ్ల ఓ వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు. తనకు మంచిర్యాలకు చెందిన మహిళ (29)తో వివాహమైంది.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారడంతో.. సామాజిక మధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించారు భార్యాభర్తలు. కొందరు వ్యాపారులు, యువకులు వారి వలలో పడ్డారు. దీంతో భార్య తన అపార్ట్మెంట్‌కు పిలిచి, వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసేవారు. తర్వాత బాధితులకు ఫోన్ చేసి.. వీడియోలు అందరికీ చూపిస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ దంపతులు డబ్బులు దండుకుంటున్నారు. ఇలా మూడేళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషులను బెదిరించి భార్యాభర్తలు డబ్బులు వసూలు చేశారు. కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని సైతం బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు దండుకొని.. మరో సారి రూ.5 లక్షలు కావాలి అనడంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story