దేశంలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. 2,700 యాక్టివ్ కేసులు, 7 మరణాలు, మే 25 తర్వాత ఐదు రెట్లు పెరుగుదల

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. 2,700 యాక్టివ్ కేసులు, 7 మరణాలు, మే 25 తర్వాత ఐదు రెట్లు పెరుగుదల, కేరళ(Kerala), మహారాష్ట్ర(Maharastra), ఢిల్లీ(Delhi)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2,710 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి, ఒక రోజులో 511 కొత్త కేసులు చేరాయి. మే 25 నాటికి 275 యాక్టివ్ కేసులు ఉండగా, మే 30 నాటికి ఇవి దాదాపు ఐదు రెట్లు పెరిగి 2,710కి చేరాయి. గత 24 గంటల్లో 7 మరణాలు నమోదయ్యాయి, మహారాష్ట్ర (2), ఢిల్లీ (1), గుజరాత్ (1), కర్ణాటక (1), పంజాబ్ (1), తమిళనాడు (1) రాష్ట్రాల్లో జరిగాయి. కేరళ: 1,147 యాక్టివ్ కేసులు, మహారాష్ట్ర: 424 యాక్టివ్ కేసులు, ఢిల్లీ: 294 యాక్టివ్ కేసులు, గుజరాత్: 223 కేసులు. కర్ణాటక: 148 కేసులు, తమిళనాడు: 148 కేసులు, పశ్చిమ బెంగాల్: 116 కేసులు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు వచ్చాయి. గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో(tamilnadu) కూడా గణనీయమైన కేసులు నమోదవుతున్నాయి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మాస్క్ ధరించడం, టెస్టింగ్ చేయించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated On 31 May 2025 6:44 AM GMT
ehatv

ehatv

Next Story