Pot Water vs Fridge Water: మట్టికుండ నీరు బెటరా.. ఫ్రిడ్జ్ నీరు బెటరా..! ఆరోగ్య నిపుణులేమంటున్నారు..!

మట్టికుండ నీరు బెటరా.. ఫ్రిడ్జ్ నీరు బెటరా..! ఆరోగ్య నిపుణులేమంటున్నారు..!
వేసవి సమీపిస్తోంది. పాత రోజుల్లో అయితే తప్పనిసరిగా మట్టికుండలోని నీరే తాగేవారు. కానీ నవీన కాలంలో ఫ్రిడ్జ్లు రావడంతో చాలా ఇళ్లలో నీటిని బాటిళ్లలో నింపి ఫ్రిడ్జ్లో వేస్తున్నారు. ఆ నీటినే తాగడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆరోగ్య నిపుణులు మట్టికుండనే వాడాలని సూచిస్తున్నారు. రోగ్యపరంగా చూస్తే మట్టి కుండలో నీరు ఎక్కువ మంచిదంటున్నారు.
మట్టికుండ..!
మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది, గొంతు నొప్పి, జలుబు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మట్టిలోని సహజ ఖనిజాలు కొద్దిగా నీటిలో కలుస్తాయి. నీటిలోని మలినాలు మట్టిలో కలిసిపోతాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారం వల్ల శరీరంలో అసిడిటీ పెరుగుతుంది. మట్టి సహజంగా ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల శరీరంలోని pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. మట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు బయటికి ఆవిరైపోతూ (evaporation) లోపల నీటిని చల్లగా ఉంచుతుంది. వడదెబ్బ నుంచి ఈ నీరు కాపాడుతుంది. ఇది పూర్తిగా నేచురల్ ప్రక్రియ. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే కెమికల్స్ సమస్య ఉండదు. మట్టి సహజ పదార్థం. మట్టి కుండ నీటికి ఒక సహజమైన తీయటి/తాజా రుచి ఉంటుంది. కుండను తరచూ శుభ్రం చేయాలి. ప్రతి 1–2 రోజులకు నీరు మార్చాలని సూచిస్తున్నారు.
ఫ్రిడ్జ్ నీరు..!
ఫ్రిడ్జ్లో నీరు చాలా వేగంగా చల్లబడుతుంది, చాలా చల్లగా ఉండటం వల్ల గొంతు, జీర్ణక్రియపై ప్రభావం పడవచ్చు. తరచూ తాగితే జలుబు, గొంతు సమస్యలు రావచ్చు


