✕
Pahalgam Attack : LOC దగ్గర పాక్ కాల్పులు.. 10 మంది భారతీయులు మృతి
By ehatvPublished on 7 May 2025 5:45 AM GMT
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్(Pakistan) లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

x
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్(Pakistan) లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పది మంది భారత ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రజలను పాక్ బలిగొందని భారత సైన్యం తెలిపింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. దీనికి బదులు తీర్చుకుంటామని భారత సైన్యం హెచ్చరించింది.

ehatv
Next Story