పాకిస్తాన్‌కు ఇండియా నోటీసులు పంపింది.

పాకిస్తాన్‌కు ఇండియా నోటీసులు పంపింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈ ఒప్పందం చాలా పాతదని, మార్పులు చేయాలని అల్టిమేటం జారీ చేసింది 1960లో రెండు దేశాల మధ్య నదీ జలాల పంపినీకి సంబంధించి ఓ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత రెండు దేశాల పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఒప్పందంలో కూడా మార్పులు అవసరమని నోటీసులు భారత్‌ పేర్కొంది. సింధు జలాల(Indus water)ఒప్పందాన్ని సమీక్షించడానికి భారతదేశం ఆగస్టు 30న ఆర్టికల్ 12(3) ప్రకారం అధికారిక నోటీసును పంపింది. అయితే దీనిపై ఇప్పటి వరకు పాకిస్తాన్‌ (Pakistan)నుంచి ఎలాంటి బదులు రాలేదు.

Updated On
ehatv

ehatv

Next Story