Birmingham Fire Accident : అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..!
అమెరికాలోని బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి చెందారు.

అమెరికాలోని బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి చెందారు. బర్మింగ్హామ్ లోని అపార్ట్మెంట్ కంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నివసిస్తున్న పదిమంది తెలుగు విద్యార్థులు. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు. అపార్ట్మెంట్లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ రావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అర్థనాదలు చేశారు. లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లి కి చెందిన మరొక విద్యార్థి మృతి చెందారు. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.


