Rs.262 crore compensation..! పోలీసుల నిర్లక్ష్యంతో యువతి ప్రాణం బలి.. రూ.262 కోట్ల పరిహారం..!

పోలీసుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోవడంతో ఆమె కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం దక్కింది. అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం ఇచ్చారు. 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి(23) అనే యువతిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు. అనంతరం "ఆమె చనిపోయింది, ఆమె చాలా మాములు మనిషి, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ " అంటూ నవ్విన పోలీస్ అధికారి డేనియల్ అడరర్. పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు సియాటెల్ నగర యంత్రాంగం ప్రకటించింది.

కర్నూల్ జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఎంఎస్ చెయ్యడం కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఆమెని ఢీకొట్టింది ఒక పోలీస్ కారు. కనీసం మానవత్వం చూపకుండా కారుతో గుద్దేసిన తరువాత "ఆమె చనిపోయింది, ఆమె చాలా మాములు మనిషి, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ " అంటూ వెకిలిగా నవ్వుతు సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ అడరర్ మాట్లాడడం భారతీయుల్ని ఆందోళనకు గురి చేస్తుంది.

Updated On
ehatv

ehatv

Next Story