జగన్పై నోరు రేణుకా చౌదరి రేణుకాచౌదరి నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియా పోస్టులలో కనిపిస్తోంది.

జగన్పై నోరు రేణుకా చౌదరి రేణుకాచౌదరి నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియా పోస్టులలో కనిపిస్తోంది. జగన్ను "వెధవన్నర వెధవ" అని బూతులతో విమర్శిస్తూ, "జగన్ పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నులిమి చంపేస్తే పీడ పోయేది" అని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ(TDP)కి చెందిన టీవీ5 ఛానెల్లో ఇవాళ సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)అరెస్టుపై చర్చ సాగుతోంది. ఇందులో ఫోన్ ఇన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) ఈ ఘటనపై స్పందిస్తూ రెచ్చిపోయారు. వైసీపీ (Ycp)అధినేత వైఎస్ జగన్ (Ys Jagan)ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బూతులతో ఆయనపై రెచ్చిపోయారు. అమరావతిపై వ్యాఖ్యల వివాదంలో కనీసం ముందుకొచ్చి సాహసం చేయని వెధవ అంటూ జగన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.
